ETV Bharat / international

5లక్షలకు చేరువలో కేసులు- 22వేలు దాటిన మరణాలు - corona cases in European

గంటగంటకు పెరిగిపోతున్న కరోనా కేసులతో ప్రపంచదేశాలు అందోళన చెందుతున్నాయి. బాధితుల సంఖ్య 5లక్షలకు చేరువ అవుతుండటం వల్ల ప్రపంచ దేశాల ప్రజలు కలవరానికి గురి అవుతున్నారు. స్పెయిన్​లో కరోనా మరణాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. యూరప్​ దేశాల్లో వైరస్​ మరింత ప్రమాదంగా మారింది.

corona Infections near 500,000
5లక్షలకు చేరువలో కరోనా కేసులు
author img

By

Published : Mar 26, 2020, 6:27 PM IST

కరోనా ​ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు పెరిగిపోతున్న కేసులు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 5లక్షలకు చేరువలో ఉంది. ప్రస్తుతం 4లక్షల 88వేల 264 కేసులున్నాయి. మృతుల సంఖ్య 22వేలు దాటింది. అమెరికా, ఇటలీ, స్పెయిన్​లో వైరస్​ ప్రభావం తీవ్రంగా ఉంది.

యూరప్​ దేశాల్లో కరోనా కోరలు చాస్తోంది. ఆయా దేశాల్లో వైరస్​ బాధితుల సంఖ్య 2లక్షలకు పైగా నమోదు కావడం.. అక్కడ మహమ్మారి తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది అర్థం చేసుకోవచ్చు.

corona-infections-near-500000
5లక్షలకు చేరువలో కరోనా కేసులు

24గంటల్లో 655 మరణాలు

వైరస్​ కేసులు, మరణాల విషయంలో ఇటలీ, స్పెయిన్​ రెండూ పోటీపడుతున్నాయి. ఆ దేశంలో 24గంటల్లో 655 మరణాలు సంభవించాయి.

ఇరాన్​లోనూ కరోనా బాధితుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. దీంతో వైరస్​ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి అంతర్గత ప్రయాణాలను రద్దు చేసింది ఇరాన్​ ప్రభుత్వం.

డబ్ల్యూహెచ్​ఓ అసహనం..

కరోనా కట్టడి విషయంలో విలువైన సమయాన్ని ప్రపంచ దేశాలు వృథా చేశాయని డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​ టెడ్రోస్ అధనామ్ అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం లక్షలాది మంది నిర్బంధంలో చిక్కుకుపోయారని, చాలా మంది నిరుద్యోగులుగా మారారని తెలిపింది. వైరస్​.. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానించారు. కరోనాను ప్రజా శత్రువుగా అభివర్ణించారు టెడ్రోస్. ఇప్పటికైనా ప్రపంచ నాయకులు కళ్లు తెరిచి వైరస్​ను పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని సూచించారు.

కరోనా ​ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. రోజురోజుకు పెరిగిపోతున్న కేసులు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 5లక్షలకు చేరువలో ఉంది. ప్రస్తుతం 4లక్షల 88వేల 264 కేసులున్నాయి. మృతుల సంఖ్య 22వేలు దాటింది. అమెరికా, ఇటలీ, స్పెయిన్​లో వైరస్​ ప్రభావం తీవ్రంగా ఉంది.

యూరప్​ దేశాల్లో కరోనా కోరలు చాస్తోంది. ఆయా దేశాల్లో వైరస్​ బాధితుల సంఖ్య 2లక్షలకు పైగా నమోదు కావడం.. అక్కడ మహమ్మారి తీవ్రత ఏ స్థాయిలో ఉందనేది అర్థం చేసుకోవచ్చు.

corona-infections-near-500000
5లక్షలకు చేరువలో కరోనా కేసులు

24గంటల్లో 655 మరణాలు

వైరస్​ కేసులు, మరణాల విషయంలో ఇటలీ, స్పెయిన్​ రెండూ పోటీపడుతున్నాయి. ఆ దేశంలో 24గంటల్లో 655 మరణాలు సంభవించాయి.

ఇరాన్​లోనూ కరోనా బాధితుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. దీంతో వైరస్​ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి అంతర్గత ప్రయాణాలను రద్దు చేసింది ఇరాన్​ ప్రభుత్వం.

డబ్ల్యూహెచ్​ఓ అసహనం..

కరోనా కట్టడి విషయంలో విలువైన సమయాన్ని ప్రపంచ దేశాలు వృథా చేశాయని డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​ టెడ్రోస్ అధనామ్ అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం లక్షలాది మంది నిర్బంధంలో చిక్కుకుపోయారని, చాలా మంది నిరుద్యోగులుగా మారారని తెలిపింది. వైరస్​.. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానించారు. కరోనాను ప్రజా శత్రువుగా అభివర్ణించారు టెడ్రోస్. ఇప్పటికైనా ప్రపంచ నాయకులు కళ్లు తెరిచి వైరస్​ను పూర్తిస్థాయిలో కట్టడి చేయాలని సూచించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.