ప్రతికూల వాతావరణంతో విశాఖకు రావాల్సిన రెండు విమానాలు దారి మళ్లించారు. చెన్నై-విశాఖ విమానం భువనేశ్వర్లో ల్యాండ్ అయ్యింది. హైదరాబాద్-విశాఖ ఇండిగో విమానం వర్షం కారణంగా వెనుదిరిగింది. వాతావరణం అనుకూలించక తిరిగి హైదరాబాద్ పంపించారు. ఈ విమానంలో విశాఖ ఎంపీ హరిబాబుతో పాటు పలువురు వ్యాపారవేత్తలు ఉన్నారు.
ప్రతికూల వాతావరణం కారణంగా... విశాఖ నుంచి బయలుదేరాల్సిన 4 విమానాలు రద్దు చేశారు. విశాఖ నుంచి బెంగళూరు, దుబాయ్ వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. విశాఖ నుంచి హైదరాబాద్, దిల్లీ వెళ్లాల్సిన విమానాలను విమాన సంస్థలు రద్దు చేశాయి. విమానాలు రద్దు కావటంతో ప్రయాణికులు వెనుదిరిగారు.