అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని అందించేలా రైతు సాధికార సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆకుకూరలు కాయగూరలతో మంచి పౌష్టికాహారాన్ని వారికి అందించేందుకు రాష్ట్రంలో న్యూట్రి, కిచెన్ గార్డెన్ అభివృద్ధికి మార్గదర్శకాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ట్రీ గార్డెన్స్, కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతు సాధికార సంస్థ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాష్ట్రంలోని 2,981 పంచాయతీల్లో న్యూట్రి గార్డెన్లు, కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 12,284 అంగన్వాడీ సెంటర్లను ఈ పంచాయతీలకు అనుసంధానించనున్నారు. న్యూట్రి గార్డెన్స్ ద్వారా మహిళలకు చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలన్నది లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. పైలట్ ప్రాతిపదికన 52 ఆరోగ్య న్యూట్రిషన్ క్లస్టర్లు గ్రామాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిని న్యూట్రిషన్ స్మార్ట్ విలేజెస్గా ప్రభుత్వం పేర్కొంది.
ఇదీ చదవండి: రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది: సీఎం జగన్