తెలుగు భాష పరిరక్షణ కోసం రచయితలు భాషా సత్యాగ్రహం చేయాలని... తెలుగు రచయితల మహాసభల నిర్వాహక కమిటీ గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్ పిలుపునిచ్చారు. సొంత రాష్ట్రంలోనే తెలుగు భాషను రక్షించుకోలేని పరిస్థితుల వల్ల... పొరుగు రాష్ట్రాలు, విదేశాల్లో తెలుగుకు మరింత గడ్డు పరిస్థితులు దాపురిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భాష, జాతి, స్వాభిమానాలు వదిలేస్తే... భాషా సంస్కృతులు దెబ్బతింటాయని చెప్పారు. రచయితలు లేకుండా భాషోద్యమం విజయవంతం కాదంటున్న మండలి బుద్ధప్రసాద్తో ఈటీవీ భారత్ ముఖాముఖి.
సినీ ప్రముఖులు తెలుగు భాషాభివృద్ధికి కృషిచేయాలని సూచించారు. తెలుగువారికి మాతృభాషంటే మమకారం ఉందనీ.. అందుకే ఇన్ని ప్రసార మాధ్యమాలు, టీవీ ఛానెళ్లు విజయవంతంగా నడుస్తున్నాయన్నారు.
ఇవీ చదవండి..