ETV Bharat / city

'విశాఖ ఉక్కు కర్మాగారంపై ఐక్య పోరాటం చేయాలి' - విశాఖ స్టీల్​ ప్లాంట్ ప్రైవేటీకరణపై తాజా వార్తలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అందరూ కలిసి పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై 2019లో పోస్కో సంస్థతో జరిగిన ఒప్పందం... సీఎం జగన్​కు తెలియదా అని ప్రశ్నించారు.

cpi rama krishna  on privatization of vishaka steel plant
cpi rama krishna on privatization of vishaka steel plant
author img

By

Published : Feb 11, 2021, 8:34 PM IST

విశాఖ ఉక్కు కర్మాగారంపై ఐక్య పోరాటం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు సీఎం తీసుకెళ్లాలని కోరారు. 2019 లోనే పోస్కో సంస్థతో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై ఒప్పందం చేసుకున్నట్లు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ చెప్పారని.. ఇది సీఎం జగన్​కు తెలియకుండానే జరిగిందా అని ప్రశ్నించారు.

ఎయిమ్స్ ఎందుకు ఆలస్యం అయిందని పార్లమెంట్​లో ప్రశ్నిస్తే కేంద్రమంత్రి ఇసుక దొరలేదని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని సీపీఐ రామకృష్ణ అన్నారు. వాలంటీర్లకు రూ.12 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రెండున్నర నెలలుగా రైతులు ఉద్యమం చేస్తున్నా.. ప్రధాని మోదీ స్పందించడం లేదని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన 'రైల్​ రోకో'కు మద్దతు తెలిపారు. తానుసైతం ప్రత్యక్షంగా పాల్గొంటామని స్పష్టం చేశారు.

విశాఖ ఉక్కు కర్మాగారంపై ఐక్య పోరాటం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు సీఎం తీసుకెళ్లాలని కోరారు. 2019 లోనే పోస్కో సంస్థతో ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై ఒప్పందం చేసుకున్నట్లు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ చెప్పారని.. ఇది సీఎం జగన్​కు తెలియకుండానే జరిగిందా అని ప్రశ్నించారు.

ఎయిమ్స్ ఎందుకు ఆలస్యం అయిందని పార్లమెంట్​లో ప్రశ్నిస్తే కేంద్రమంత్రి ఇసుక దొరలేదని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని సీపీఐ రామకృష్ణ అన్నారు. వాలంటీర్లకు రూ.12 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రెండున్నర నెలలుగా రైతులు ఉద్యమం చేస్తున్నా.. ప్రధాని మోదీ స్పందించడం లేదని రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన 'రైల్​ రోకో'కు మద్దతు తెలిపారు. తానుసైతం ప్రత్యక్షంగా పాల్గొంటామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

పట్టుచెన్నారులో ఎన్నికలు జరగనివ్వమంటున్న ఒడిశా.. జరిపితీరుతామంటున్న ఏపీ...

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.