APSRTC Income for Sankanrthi: సంక్రాంతి సందర్భంగా 5,422 ప్రత్యేక బస్సుల ద్వారా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసినట్లు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. ఈనెల 7 నుంచి 18 వరకు మొత్తం రూ.144 కోట్ల ఆదాయం సమకూరినట్లు ఆయన వివరించారు. కాగా.. అత్యధికంగా 17వ తేదీన.. 36లక్షల మందిని గమస్థానాలకు చేర్చగా.. ఆ ఒక్కరోజే రూ.15.40 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఏపీ నుంచి హైదరాబాద్కు 1,350 బస్సులు నడిపగా.. కొవిడ్ దృష్ట్యా చెన్నై, బెంగళూరు నుంచి ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గినట్లు పేర్కొన్నారు. ఆర్టీసీని ఆదరించిన ప్రయాణికులకు ధన్యవాదాలు తెలిపారు.
AP Cabinet Decisions: రాష్ట్ర మంత్రివర్గ భేటీ.. తీసుకున్న నిర్ణయాలు ఇవే..