కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానంది ఆలయ దర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. లాక్డౌన్ సడలింపు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకునే వెసులుబాటు కల్పించారు. జూన్ 21 వతేదీ సోమవారం నుంచి ఈ దర్శన వేళలు అమల్లోకి వస్తాయి. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆన్ లైన్ లింకు సాయంతో పరోక్ష సేవ ద్వార భక్తులు ప్రత్యేక పూజలు చేసుకొనే వెసులుబాటు ఉందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: Srisailam: మల్లన్న ఆలయ దర్శన వేళల్లో మార్పులు: ఈవో
మహానంది ఆలయ దర్శన వేళల్లో మార్పులు
కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం మహానంది ఆలయ దర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు భక్తులకు దర్శించుకునే అవకాశాన్ని కల్పించారు.
కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం మహానంది ఆలయ దర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. లాక్డౌన్ సడలింపు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులకు మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకునే వెసులుబాటు కల్పించారు. జూన్ 21 వతేదీ సోమవారం నుంచి ఈ దర్శన వేళలు అమల్లోకి వస్తాయి. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆన్ లైన్ లింకు సాయంతో పరోక్ష సేవ ద్వార భక్తులు ప్రత్యేక పూజలు చేసుకొనే వెసులుబాటు ఉందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: Srisailam: మల్లన్న ఆలయ దర్శన వేళల్లో మార్పులు: ఈవో