కాకినాడ జీజీహెచ్లో ఏర్పాటు చేసిన దిశ వన్ స్టాప్ సెంటర్ను దిశ కమిషన్ ఛైర్పర్సన్ కృతిక శుక్ల పరిశీలించారు. అత్యాచారాలకు గురైన బాధితులకు మెడికల్, మానసిక, లీగల్, ఎఫ్ఐఆర్ తదితర సేవలు తక్షణమే అందుబాటులో ఉంటాయని ఆమె అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలో జరిగే దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సెంటర్ను ప్రారంభిస్తారన్నారు. 48 లక్షల వ్యయంతో శాశ్వత భవనం నిర్మించనున్నట్లు ఆమె వివరించారు.
ఇదీ చదవండి :