ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతికి ఎంపికైన అభిజిత్ బెనర్జీతో కలిసి చదువుకున్నానని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. అభిజిత్ బెనర్జీ నోబెల్ బహుమతికి ఎంపికైన విషయం పత్రికల ద్వారా తెలుసుకున్న ఆయన.. తన జ్ఞాపకాలను మీడియాతో పంచుకున్నారు. ఢిల్లీలోని జేఎన్ యూలో అభిజిత్ బెనర్జీతో కలిసి 1981- 83 సంవత్సరంలో ఎం.ఏ ఎకనామిక్స్ చదువుకున్నట్టు గుర్తు చేసుకున్నారు. పీజీ అనంతరం ఉద్యోగ ప్రయత్నాలతో వేర్వేరు రంగాల్లో స్థిరపడ్డామని చెప్పారు. అభిజిత్ బెనర్జీ ఎప్పుడు క్లాస్ టాపర్ గా ఉండేవారని, తన స్నేహితుడు నోబెల్ ప్రైజ్ కు ఎంపిక కావటం ఎంతో గర్వంగా ఉందని అన్నారు.
ఇదీ చూడండి