సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మరిగూడ ముత్యాలమ్మ ఆలయంలో దొంగతనం జరిగింది. హుండీలో ఉన్న నగదును దొంగలు దోచుకెళ్లారు. అర్ధరాత్రి సమయంలో చోరీకి పాల్పడ్డారు. దేవాలయ తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం హుండీని పగులగొట్టి.. అందులో ఉన్న విలువైన వస్తువులను, నగదును అపహరించారు.
ఉదయాన్నే స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు. చోరీ జరిగిన తీరును పరిశీలించారు. దొంగతనం చేసే దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చోరీకి పాల్పడింది స్థానికులేనా.. లేక బయట వ్యక్తుల అనే కోణంలో విచారణ ప్రారంభించారు.
ఇదీ చదవండి: రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల దాడులు.. భారీగా అక్రమ మద్యం, నాటుసారా పట్టివేత