ETV Bharat / city

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

author img

By

Published : Mar 14, 2021, 8:35 AM IST

Updated : Mar 14, 2021, 9:23 AM IST

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉభయగోదావరి, కృష్ణా - గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.‌

mlc elections
mlc elections
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 వరకే పోలింగ్‌ ముగియనుంది. ఈ నెల 17న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

రెండు స్థానాల నుంచి పోటీలో 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కృష్ణా - గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 11 మంది పోటీలో ఉన్నారు. కృష్ణా జిల్లాలో 51, గుంటూరు జిల్లాలో 60, తూర్పు గోదావరి జిల్లాలో 67, పశ్చిమ గోదావరి జిల్లాలో 49 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది.

ఇదీ చదవండి:

నూజివీడులో ఘోర ప్రమాదం.. ఆటోను ఢీ కొట్టిన లారీ.. ఆరుగురు మృతి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 వరకే పోలింగ్‌ ముగియనుంది. ఈ నెల 17న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

రెండు స్థానాల నుంచి పోటీలో 30 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కృష్ణా - గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 11 మంది పోటీలో ఉన్నారు. కృష్ణా జిల్లాలో 51, గుంటూరు జిల్లాలో 60, తూర్పు గోదావరి జిల్లాలో 67, పశ్చిమ గోదావరి జిల్లాలో 49 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగుతోంది.

ఇదీ చదవండి:

నూజివీడులో ఘోర ప్రమాదం.. ఆటోను ఢీ కొట్టిన లారీ.. ఆరుగురు మృతి

Last Updated : Mar 14, 2021, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.