ETV Bharat / city

Ration cards: ఒక రేషన్‌కార్డుకు ఒకటే పింఛను.. రెండోది ఉంటే తొలగింపే

author img

By

Published : Aug 20, 2021, 7:34 AM IST

ఒక రేషన్‌కార్డుకు ఒకటే పింఛను విధానాన్ని పక్కాగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు తీసుకుంటుంటే ఒక పింఛను రద్దు చేయనుంది. అయితే ఇందులో దివ్యాంగులు, ఆరోగ్య పింఛన్లకు మినహాయింపు ఇవ్వనుంది.

same pension
same pension

ఒక రేషన్‌ కార్డుకు ఒకటే పింఛను విధానాన్ని ప్రభుత్వం మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. గతేడాది మే నెలలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం.. లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవడంతో కాస్త వెనక్కి తగ్గింది. తాజాగా ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు తీసుకుంటుంటే ఒక పింఛను రద్దు చేయనుంది. దివ్యాంగ, అభయహస్తం, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, కొన్ని రకాల డీఎంహెచ్‌వో పింఛన్లకు దీని నుంచి మినహాయింపునిచ్చింది. ఈ మేరకు ఒకే రేషన్‌ కార్డుపై రెండు పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల్లో ఒకరి పేరు మీద తాఖీదులు పంపింది. ఈ నెల 13న జారీ చేసిన ఈ తాఖీదులను వాలంటీర్లు లబ్ధిదారులకు అందిస్తున్నారు. కడప, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.

7 రోజుల్లో అర్హత నిరూపించుకోకుంటే శాశ్వతంగా రద్దు

‘2019 డిసెంబరు 13న జారీ చేసిన ఉత్తర్వు 174 ప్రకారం పింఛను సంఖ్యను నమోదు చేసి మీ వ్యక్తిగత/ కుటుంబ వివరాలను పరిశీలించాం. మరొకరు కూడా లబ్ధి పొందుతున్నట్లు గుర్తించాం. ప్రభుత్వం నుంచి పింఛను పొందేందుకు మిమ్మల్ని అనర్హులుగా గుర్తించాం. ఆ మేరకు పింఛనును తాత్కాలికంగా నిలిపేస్తున్నాం. తాఖీదు అందుకున్న 7 రోజుల్లో ఏ పింఛను కొనసాగించాలో మండల కార్యాలయానికి రాతపూర్వకంగా తెలపాలి. పింఛను అర్హతకు తగు ఆధారాలు సమర్పించకపోతే శాశ్వతంగా రద్దు చేస్తాం’ అని తాఖీదుల్లో స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: varalakshmi vratham: వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలంటే..?

ఒక రేషన్‌ కార్డుకు ఒకటే పింఛను విధానాన్ని ప్రభుత్వం మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. గతేడాది మే నెలలో ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించిన ప్రభుత్వం.. లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవడంతో కాస్త వెనక్కి తగ్గింది. తాజాగా ఈ విధానాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. ఒకే కుటుంబంలో రెండు పింఛన్లు తీసుకుంటుంటే ఒక పింఛను రద్దు చేయనుంది. దివ్యాంగ, అభయహస్తం, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, కొన్ని రకాల డీఎంహెచ్‌వో పింఛన్లకు దీని నుంచి మినహాయింపునిచ్చింది. ఈ మేరకు ఒకే రేషన్‌ కార్డుపై రెండు పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల్లో ఒకరి పేరు మీద తాఖీదులు పంపింది. ఈ నెల 13న జారీ చేసిన ఈ తాఖీదులను వాలంటీర్లు లబ్ధిదారులకు అందిస్తున్నారు. కడప, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో ఈ మేరకు నోటీసులు జారీ చేశారు.

7 రోజుల్లో అర్హత నిరూపించుకోకుంటే శాశ్వతంగా రద్దు

‘2019 డిసెంబరు 13న జారీ చేసిన ఉత్తర్వు 174 ప్రకారం పింఛను సంఖ్యను నమోదు చేసి మీ వ్యక్తిగత/ కుటుంబ వివరాలను పరిశీలించాం. మరొకరు కూడా లబ్ధి పొందుతున్నట్లు గుర్తించాం. ప్రభుత్వం నుంచి పింఛను పొందేందుకు మిమ్మల్ని అనర్హులుగా గుర్తించాం. ఆ మేరకు పింఛనును తాత్కాలికంగా నిలిపేస్తున్నాం. తాఖీదు అందుకున్న 7 రోజుల్లో ఏ పింఛను కొనసాగించాలో మండల కార్యాలయానికి రాతపూర్వకంగా తెలపాలి. పింఛను అర్హతకు తగు ఆధారాలు సమర్పించకపోతే శాశ్వతంగా రద్దు చేస్తాం’ అని తాఖీదుల్లో స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: varalakshmi vratham: వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.