వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. "విశాఖలో నేను రెండెకరాల భూమి కబ్జా చేశానని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఆ రెండెకరాలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తే రెండెకరాలని జగన్ రెడ్డి పేరు మీద లేదా వైకాపా పేరు మీద రాయడానికి సిద్ధం. ఆధారాలు మీడియాకి చూపించి రెండెకరాలు తీసుకోండి. మీ భూదాహానికి రెండెకరాలు చిన్న విషయమే అయినా ఆధారాలు చూపిస్తే చిరు కానుకగా ఇవ్వడానికి నేను సిద్ధం'' అని ట్విట్టర్ వేదికగా బుద్ధా వెంకన్న వెల్లడించారు.
ఇదీ చదవండి