ETV Bharat / city

ప్రధాన వార్తలు@ 7 PM - trending news

.

ప్రధాన వార్తలు @ 7 PM
ప్రధాన వార్తలు @ 7 PM
author img

By

Published : Nov 4, 2020, 7:05 PM IST

  • అధ్యక్ష పోరు: ఈ 'స్వింగ్​'కు బౌల్డ్​ అయ్యేదెవరు?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వింగ్​ రాష్ట్రాల పాత్ర కీలకం. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా సాగుతున్న తరుణంలో ప్రజల చూపు ఈ స్వింగ్​ స్టేట్స్​పై పడింది. మరి అధ్యక్ష పదవి చేపట్టడంలో కీలకంగా మారిన ఈ రాష్ట్రాల్లో గెలుపెవరిది? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అధ్యక్ష పోరు: ట్రంప్​పై 11 ఓట్ల ఆధిక్యంలో బైడెన్​

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, విపక్ష డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది. ఇప్పటివరకు 41 రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడగా.. బైడెన్‌224 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ సీపీఎం కౌంటర్‌ దాఖలు

రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు... హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. రాజధానితో సంబంధం లేదని కేంద్రం చెప్పటం సమంజసం కాదని పేర్కొన్నారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్‌ అసెంబ్లీలోనే రాజధానిగా అమరావతిని సమర్థించారని అఫిడవిట్‌లో గుర్తు చేశారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రాష్ట్రంలో కొత్తగా 2,477 కరోనా కేసులు..10 మరణాలు

రాష్ట్రంలో కొత్తగా 2,477 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,33,208కు చేరింది. తాజాగా వైరస్ బారిన పడి మరో 10 మంది మృతి చెందగా... రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 6,744 గా ఉంది. కొవిడ్ బారిన పడి మరో 2,701 మంది కోలుకోగా... మొత్తం బాధితుల సంఖ్య 8.05 లక్షల మందిగా నమోదైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రేపట్నుంచే పరీక్షలు.. హాల్ టిక్కెట్లు ఇచ్చేది లేదంటున్న అధికారులు!

యాజమాన్య కోటాలో స్పాట్ అడ్మిషన్లు పొందిన తమను పరీక్షలకు అనుమతించాలంటూ డీఈడీ విద్యార్థులు రోడ్డెక్కారు. రేపట్నుంచి ప్రారంభంకానున్న పరీక్షలు రాసే అవకాశమివ్వాలని వేడుకున్నారు. అధికారులు మాత్రం కౌన్సెలింగ్ ద్వారా చేరని వారికి హాల్ టిక్కెట్లు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఔషధ నియంత్రణ శాఖ అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు

గుంటూరులో ఔషధ నియంత్రణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎంవీఎస్ఎస్ వరప్రసాద్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మహారాష్ట్రలో రేపటి నుంచి సినిమా హాళ్లు ఓపెన్​

మహారాష్ట్ర లాక్​డౌన్ నిబంధనలు సడలించింది. నవంబరు 5 నుంచి సినిమా థియేటర్లు, ఈత కొలనులు, యోగా కేంద్రాలు తెరవడం సహా మరికొన్నింటికి అనుమతిచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'అయోధ్యలో నిర్మాణాలకు మీరూ సలహాలు ఇవ్వొచ్చు'

అయోధ్య రాముడి దర్శనానికి రోజుకు లక్ష నుంచి 5 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​. అందుకు తగిన విధంగా అవసరమైన సౌకర్యాల కల్పన, ఆలయం చుట్టూ ఉన్న 70 ఎకరాల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయటానికి ప్రజలు స్వచ్ఛందంగా సలహాలు, సూచనలు అందించాలని కోరింది​. పుష్కరణి, వివిధ మండపాలు, ఇతర నిర్మాణాల కోసం వాస్తు శాస్త్రం ప్రకారం డిజైన్ల నమూనాలు పంపించాలని సూచించింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'వాతావరణ మార్పులతో వికెట్లు తీయడం కష్టమే!'

యూఏఈలో వాతావరణ మార్పుల వల్ల బౌలర్లు వేసుకునే ప్రణాళికలు దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నాడు పేసర్ జస్​ప్రీత్​ బుమ్రా. చెమట, మంచు కారణంగా బౌలర్లు వికెట్లు పడగొట్టడంలో సమస్యలు ఎదుర్కొంటారని అన్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఈ జంట చిందేస్తే.. సినిమా సూపర్ హిట్!

సినిమాల్లో కొన్ని జంటల్ని చూస్తే మచ్చటేస్తుంది. తమ అందం, అభినయం, కెమిస్టీలతో అభిమానుల్ని మాయ చేస్తారు, ఆకట్టుకుంటారు, వారి మదిలో స్థానం సంపాదిస్తారు. అలా మెప్పించి ఎవర్​గ్రీన్​గా నిలిచిపోయిన కొన్ని జోడీల గురించే ఈ ప్రత్యేక కథనం.

  • అధ్యక్ష పోరు: ఈ 'స్వింగ్​'కు బౌల్డ్​ అయ్యేదెవరు?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో స్వింగ్​ రాష్ట్రాల పాత్ర కీలకం. ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా సాగుతున్న తరుణంలో ప్రజల చూపు ఈ స్వింగ్​ స్టేట్స్​పై పడింది. మరి అధ్యక్ష పదవి చేపట్టడంలో కీలకంగా మారిన ఈ రాష్ట్రాల్లో గెలుపెవరిది? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అధ్యక్ష పోరు: ట్రంప్​పై 11 ఓట్ల ఆధిక్యంలో బైడెన్​

ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, విపక్ష డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌ మధ్య ఆధిక్యం దోబూచులాడుతోంది. ఇప్పటివరకు 41 రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడగా.. బైడెన్‌224 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ సీపీఎం కౌంటర్‌ దాఖలు

రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు... హైకోర్టులో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. రాజధానితో సంబంధం లేదని కేంద్రం చెప్పటం సమంజసం కాదని పేర్కొన్నారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్‌ అసెంబ్లీలోనే రాజధానిగా అమరావతిని సమర్థించారని అఫిడవిట్‌లో గుర్తు చేశారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రాష్ట్రంలో కొత్తగా 2,477 కరోనా కేసులు..10 మరణాలు

రాష్ట్రంలో కొత్తగా 2,477 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,33,208కు చేరింది. తాజాగా వైరస్ బారిన పడి మరో 10 మంది మృతి చెందగా... రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 6,744 గా ఉంది. కొవిడ్ బారిన పడి మరో 2,701 మంది కోలుకోగా... మొత్తం బాధితుల సంఖ్య 8.05 లక్షల మందిగా నమోదైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రేపట్నుంచే పరీక్షలు.. హాల్ టిక్కెట్లు ఇచ్చేది లేదంటున్న అధికారులు!

యాజమాన్య కోటాలో స్పాట్ అడ్మిషన్లు పొందిన తమను పరీక్షలకు అనుమతించాలంటూ డీఈడీ విద్యార్థులు రోడ్డెక్కారు. రేపట్నుంచి ప్రారంభంకానున్న పరీక్షలు రాసే అవకాశమివ్వాలని వేడుకున్నారు. అధికారులు మాత్రం కౌన్సెలింగ్ ద్వారా చేరని వారికి హాల్ టిక్కెట్లు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఔషధ నియంత్రణ శాఖ అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు

గుంటూరులో ఔషధ నియంత్రణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎంవీఎస్ఎస్ వరప్రసాద్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ తనిఖీల్లో అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మహారాష్ట్రలో రేపటి నుంచి సినిమా హాళ్లు ఓపెన్​

మహారాష్ట్ర లాక్​డౌన్ నిబంధనలు సడలించింది. నవంబరు 5 నుంచి సినిమా థియేటర్లు, ఈత కొలనులు, యోగా కేంద్రాలు తెరవడం సహా మరికొన్నింటికి అనుమతిచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'అయోధ్యలో నిర్మాణాలకు మీరూ సలహాలు ఇవ్వొచ్చు'

అయోధ్య రాముడి దర్శనానికి రోజుకు లక్ష నుంచి 5 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్​. అందుకు తగిన విధంగా అవసరమైన సౌకర్యాల కల్పన, ఆలయం చుట్టూ ఉన్న 70 ఎకరాల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయటానికి ప్రజలు స్వచ్ఛందంగా సలహాలు, సూచనలు అందించాలని కోరింది​. పుష్కరణి, వివిధ మండపాలు, ఇతర నిర్మాణాల కోసం వాస్తు శాస్త్రం ప్రకారం డిజైన్ల నమూనాలు పంపించాలని సూచించింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'వాతావరణ మార్పులతో వికెట్లు తీయడం కష్టమే!'

యూఏఈలో వాతావరణ మార్పుల వల్ల బౌలర్లు వేసుకునే ప్రణాళికలు దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నాడు పేసర్ జస్​ప్రీత్​ బుమ్రా. చెమట, మంచు కారణంగా బౌలర్లు వికెట్లు పడగొట్టడంలో సమస్యలు ఎదుర్కొంటారని అన్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఈ జంట చిందేస్తే.. సినిమా సూపర్ హిట్!

సినిమాల్లో కొన్ని జంటల్ని చూస్తే మచ్చటేస్తుంది. తమ అందం, అభినయం, కెమిస్టీలతో అభిమానుల్ని మాయ చేస్తారు, ఆకట్టుకుంటారు, వారి మదిలో స్థానం సంపాదిస్తారు. అలా మెప్పించి ఎవర్​గ్రీన్​గా నిలిచిపోయిన కొన్ని జోడీల గురించే ఈ ప్రత్యేక కథనం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.