హాంకాంగ్కు నల్లధనం ట్రాన్స్ఫర్ ఆరోపణలపై చెన్నై వ్యక్తులకు చెందిన 51 సంస్థలపై సీబీఐ కేసు నమోదు చేసింది. 2014-15 సమయంలో మొత్తం రూ.1038 కోట్ల నల్లధనం బదిలీ చేశారని పేర్కొంది. తమిళనాడులోని బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖలకు చెందిన గుర్తుతెలియని అధికారుల సాయంతో రహస్యంగా ఈ అక్రమానికి పాల్పడినట్లు అధికారులు వివరించారు.
అక్రమాలకు పాల్పడ్డ 48 సంస్థలకు చెందిన 51 సంస్థల ప్రస్తుత బ్యాంకు ఖాతాల వివరాలు సంపాదించినట్లు పేర్కొన్నారు సీబీఐ అధికారులు. బీఓఐ, ఎస్బీఐ, పీఎన్బీకి చెందిన శాఖలలోనే సదరు ఖాతాలు ఉన్నట్లు తెలిపారు.
48 సంస్థలతో పాటు మహ్మద్ ఇబ్రామ్సా జానీ, జింతా మిదర్, నిజాముద్దీన్ అనే ముగ్గురు వ్యక్తుల పేర్లను ఎఫ్ఐర్లో చేర్చారు. ఇందులో 24 కంపెనీలు దిగుమతులు చేసుకున్న వస్తువుల విలువ.. బ్యాంకులకు సమర్పించిన డేటాతో సరిపోలడం లేదన్నారు అధికారులు.
ఈ అక్రమానికి పాల్పడిన నిందితులతో పాటు సహాయపడిన వారికి.. బదిలీ చేసిన మొత్తం ఆధారంగా కమీషన్ అందినట్లు అధికారులు తెలిపారు. బ్యాంకు అధికారులకూ లంచం ఇచ్చినట్లు ఎఫ్ఐర్లో పేర్కొన్నారు.
ఇందులో ఎక్కువ మొత్తం బదిలీ 2015 రెండో అర్ధ భాగంలో జరిగినట్లు.. కోట్ల రూపాయల మేర బదిలీ జరిగితే... లక్షల్లో లెక్క చూపినట్లు అధికారులు వెల్లడించారు.