women Beggars Robbery in Bhadrachalam : ఇద్దరు మహిళలు చంటి పిల్లాడితో భిక్షాటన చేస్తున్నట్లు నటించి, ఓ మహిళ పర్సును దొంగలించారు. ఈ ఘటన భద్రాచలంలో జరిగింది. గురువారం భిక్షాటన చేస్తూ ఓ దుకాణానికి వెళ్లిన మహిళలు, అక్కడే ఉన్న మరో మహిళ పర్సును దొంగిలించారు. పర్సులో ఉన్న రూ.5 వేలు తీసుకుని మిగతా ఫ్రూఫ్ కార్డులు దారిలో వదిలేసి వెళ్లారు.
ఓ యువకుడి సహాయంతో సీసీటీవీ పరిశీలించగా భిక్షాటన చేస్తున్న ఇద్దరు మహిళా దొంగలను పట్టుకున్నారు. దీంతో అక్కడున్న వారంతా ఆ మహిళలను తిట్టి దొంగలించిన సొమ్ము తీసుకుని బాధిత మహిళకు అందించారు. పట్టణంలో చాలా మంది ఇలాంటి మహిళలు భిక్షాటన చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపించారు.