Man Died in Narsapur Road Accident : మెదక్ జిల్లా నర్సాపూర్ ఎల్లమ్మ గుడి వద్ద సంగారెడ్డి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను తప్పించబోయి బీవీఆర్ఐటీ కళాశాలకు చెందిన రెండు బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ బస్సు డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందగా, సుమారు 10 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నర్సాపూర్, సంగారెడ్డి, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంతో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది.
ఒకదాన్నొకటి ఢీకొన్న కాలేజీ బస్సులు - డ్రైవర్ మృతి, 10 విద్యార్థులకు గాయాలు
Published : 3 hours ago
Man Died in Narsapur Road Accident : మెదక్ జిల్లా నర్సాపూర్ ఎల్లమ్మ గుడి వద్ద సంగారెడ్డి ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను తప్పించబోయి బీవీఆర్ఐటీ కళాశాలకు చెందిన రెండు బస్సులు పరస్పరం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ బస్సు డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందగా, సుమారు 10 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నర్సాపూర్, సంగారెడ్డి, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంతో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది.