Karnataka Police Arrest Two Persons in Kurnool District: రాష్ట్రం గంజాయి విక్రయాలకు అడ్డాగా మారిపోయింది. ఏకంగా ఇతర రాష్ట్రాలలో సైతం విక్రయాలు జరుపుతున్నారు. దీంతో ఆయా రాష్ట్రాల పోలీసులు ఏపీలో సోదాలు నిర్విహించి మరీ రాష్ట్రానికి చెందిన వారిని పట్టుకుంటున్నారు. ఇటీవలే కొంతమంది ఎలాంటి భయం, బెరుకు లేకుండా అరటి పండ్లు అమ్మినంత సులువుగా గంజాయిని కర్ణాటకలో అమ్మినట్లు పోలీసులు నిర్ధరించారు.
దీంతో తాజాగా కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లూరు గ్రామంలో కర్ణాటక పోలీసులు సోదాలు చేశారు. ఇటీవలే సంతేకుడ్లూరుకు చెందిన ఇద్దరు గ్రామవాసులు కర్ణాటకలో గంజాయి అమ్మినట్లు పోలీసులు నిర్ధరించారు. దీంతో గ్రామానికి చెందిన రవి, చంద్ర ఇళ్లలో కర్ణాటక పోలీసుల సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో నిందితుల ఇళ్లలో గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితులను అదుపులో తీసుకుని, వారి వద్ద నుంచి 45 కిలోల గంజాయిను బళ్లారి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.