CJI DY Chandrachud Visited Tirumala Temple : తిరుమల శ్రీవారిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద జస్టిస్ చంద్రచూడ్ దంపతులకు టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్ళిన జస్టిస్ చంద్రచూడ్ దంపతులు గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వచనం అందుకున్నారు. జస్టిస్ చంద్రచూడ్కు అధికారులు స్వామివారి చిత్ర పటం, తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ డీవై చంద్రచూడ్
By ETV Bharat Andhra Pradesh Team
Published : 5 hours ago
CJI DY Chandrachud Visited Tirumala Temple : తిరుమల శ్రీవారిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద జస్టిస్ చంద్రచూడ్ దంపతులకు టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు. క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్ళిన జస్టిస్ చంద్రచూడ్ దంపతులు గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వచనం అందుకున్నారు. జస్టిస్ చంద్రచూడ్కు అధికారులు స్వామివారి చిత్ర పటం, తీర్థప్రసాదాలను అందజేశారు.