Sai Dharam Tej Pan India Movie: మెగాహీరో సాయిధరమ్ తేజ్ పాన్ ఇండియా ప్రపంచంలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని తేజ్ సోషల్ మీడియాలో స్వయంగా శుక్రవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు. 'ఇది ఎంతో ప్రత్యేకమైనది. మీ అందరి ఆశీస్సులు కావాలి' అని పోస్ట్కు క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ సినిమాకు రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తుండగా, ప్రైమ్షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా 'SDT 18' ప్రాజెక్ట్ టైటిల్తో తెరకెక్కనుంది.
కాగా, తేజ్ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ రూ.100 కోట్ల కలెక్షన్ సినిమాలతో ఫుల్ జోష్లో ఉన్నారు. గతేడాది రిలీజైన 'విరూపాక్ష' బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దక్కించుకోగా, 'బ్రో' సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. ఇక పాన్ఇండియా లెవెల్లో తన టాలెంట్ చూపబోతున్న తేజ్కు మెగాఫ్యాన్స్ అభినందనలు తెలుపుతున్నారు.