'జగన్ పాలనలో ఏపీకి రాజధాని లేదు' - 'రాష్ట్రాభివృద్ధికి కృషి చేసే వారికే ఓటు వేస్తాం' - Public interview on use of vote - PUBLIC INTERVIEW ON USE OF VOTE
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : May 10, 2024, 7:31 PM IST
Vote For Change in Future then Public Interview: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. ఆ ఒక్క ఓటుతో మనుషుల తలరాతలు మారుతుంటాయి. అంతటి విలువ గల ఓటును నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు హైదరాబాద్ మహానగరంలో స్థిరపడ్డ ఏపీ ఓటర్లు. పోలింగ్కు మరో మూడు రోజులు మాత్రమే ఉండగా అందులోని వరుస సెలవులు రావడంతో జంట నగరాల నుంచి ఒకేసారి ఎక్కువ సంఖ్యలో ఓట్ల పండుగకు సొంత నియోజకవర్గాలకు వెళ్తుండటంతో రైళ్లు, బస్సుల్లో సీట్లన్ని నిండుకున్నాయి. అయినా కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎలాగైన ఈసారి తమ ఓటు హక్కు వినియోగించుకుంటామని ఓటర్లు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేసే నాయకుడికే తమ ఓటు వేస్తామంటున్నారు ఓటర్లు. ప్రతి ఒక్కరూ ఓటుని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి అధ్వానంగా తయారైందని మద్యం, ఇసుక రవాణా, భూకబ్జాలు, అక్రమ మైనింగ్ వంటివి పెరిగిపోయాయని ఓటర్లు అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిందని పలువురు విమర్శిస్తున్నారు. మంచి నాయకుడిని ఎన్నుకోకపోతే అభివృద్ధి మరుగున పడుతుందని అందుచేతనే రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో ముందుకు నడిపించే నాయకుడికే తమ ఓటు వేస్తామని ఓటర్లు చెబుతున్నారు.