Published : Feb 13, 2024, 3:46 PM IST
|Updated : Feb 13, 2024, 7:08 PM IST
LIVE : మేడిగడ్డ పర్యటనలో సీఎం రేవంత్ టీమ్
MLAs Medigadda tour live : మేడిగడ్డకు సర్కార్ కదిలింది. ఆనకట్ట కుంగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు శాసనసభ, మండలి సభ్యులతో కలిసి ముఖ్యమంత్రి, మంత్రులు ప్రత్యేక బస్సులో వెళ్లారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం అక్కడి నుంచి ఏర్పాటు చేసిన నాలుగు ప్రత్యేక బస్సుల్లో సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేరుకున్నారు. మేడిగడ్డ సందర్శనకు సభ్యులందరిని ప్రభుత్వం ఆహ్వానించగా బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఐ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ నుంచి ఏర్పాటు చేసిన బస్సుల్లో వెళ్లారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పర్యటన నేపథ్యంలో మేడిగడ్డ వద్ద అధికార యంత్రాంగం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. డీఐజీ, నలుగురు ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, పెద్ద సంఖ్యలో సీఐలు, ఎస్సైలు, సుమారు 800 మంది పోలీసు బందోబస్తులో పాల్గొన్నారు. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్లోని పియర్స్ను సీఎం బృందం పరిశీలించే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతానికి వెళ్లేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.