ETV Bharat / state

ఇకపై ఏపీ విద్యార్థులు తెలంగాణలో చదవలేరు ! - ఆ సీట్లకు మార్గదర్శకాలు జారీ - TG GOVT ON ENGINEERING SEATS

ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కాలేజీల్లో అడ్మిషన్స్ గైడ్ లైన్స్​లో సవరణలు - 85% సీట్లు లోకల్ విద్యార్థులకు కేటాయిస్తూ ఆదేశాలు

Telangana Govt New Orders on Engineering Seats
Telangana Govt New Orders on Engineering Seats (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 27, 2025, 6:27 PM IST

Updated : Feb 27, 2025, 7:28 PM IST

Telangana Govt New Orders on Engineering Seats : ఇంజనీరింగ్ సహా ఉన్నత విద్యా కోర్సుల సీట్ల కేటాయింపులో ఏపి విద్యార్థులు పోటీ పడే అవకాశాన్ని ప్రభుత్వం తొలగించింది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో స్థానికత కోటాను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి 85% సీట్లు తెలంగాణ స్థానిక విద్యార్థులకు రిజర్వ్​డ్​ కోటాగా పేర్కొంది. మరో 15 శాతం అన్ రిజర్వ్​డ్​ కోటాగా పరిగణించింది. అయితే అన్​ రిజర్వ్​డ్​ కోటాలోని సీట్లకు తెలంగాణలో కనీసం 10 ఏళ్లు నివసించినా, రాష్ట్రంలో పని చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, లేదా ఉద్యోగుల భాగస్వాములు పోటీ పడేందుకు అవకాశం కల్పించింది.

పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో సవరణలు : స్థానికత అంశంపై ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సర్కార్, ఆ కమిటీ నివేదిక ఆధారంగా కోటా కేటాయించినట్టు పేర్కొంది. ఇప్పటి వరకు ఆయా వృత్తి విద్యా కోర్సు​లలో 15% ఏపీ విద్యార్థులు పోటీ పడేవారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం, రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ విద్య సంవత్సరం నుంచి స్థానికత అమలుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మరోవైపు పలు పీజీ, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన నోటిఫికేషన్స్ సైతం విడుదల చేసింది సర్కారు. అయితే ఆయా నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంలోపే స్థానికత అంశంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

బీటెక్​ విద్యార్థులకు అలర్ట్​ - ఇక నుంచి ఇండస్ట్రియల్​ ఇంటర్న్​షిప్​లు తప్పనిసరి!

Telangana Govt New Orders on Engineering Seats : ఇంజనీరింగ్ సహా ఉన్నత విద్యా కోర్సుల సీట్ల కేటాయింపులో ఏపి విద్యార్థులు పోటీ పడే అవకాశాన్ని ప్రభుత్వం తొలగించింది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో స్థానికత కోటాను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి 85% సీట్లు తెలంగాణ స్థానిక విద్యార్థులకు రిజర్వ్​డ్​ కోటాగా పేర్కొంది. మరో 15 శాతం అన్ రిజర్వ్​డ్​ కోటాగా పరిగణించింది. అయితే అన్​ రిజర్వ్​డ్​ కోటాలోని సీట్లకు తెలంగాణలో కనీసం 10 ఏళ్లు నివసించినా, రాష్ట్రంలో పని చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు, లేదా ఉద్యోగుల భాగస్వాములు పోటీ పడేందుకు అవకాశం కల్పించింది.

పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో సవరణలు : స్థానికత అంశంపై ఇప్పటికే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సర్కార్, ఆ కమిటీ నివేదిక ఆధారంగా కోటా కేటాయించినట్టు పేర్కొంది. ఇప్పటి వరకు ఆయా వృత్తి విద్యా కోర్సు​లలో 15% ఏపీ విద్యార్థులు పోటీ పడేవారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం, రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ విద్య సంవత్సరం నుంచి స్థానికత అమలుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. మరోవైపు పలు పీజీ, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన నోటిఫికేషన్స్ సైతం విడుదల చేసింది సర్కారు. అయితే ఆయా నోటిఫికేషన్లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంలోపే స్థానికత అంశంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

బీటెక్​ విద్యార్థులకు అలర్ట్​ - ఇక నుంచి ఇండస్ట్రియల్​ ఇంటర్న్​షిప్​లు తప్పనిసరి!

బీటెక్ కన్వీనర్‌ సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే? - 15 శాతం నాన్​లోకల్​ కోటా ఎత్తివేత

హడలెత్తిస్తున్న బీటెక్‌ ఫీజులు - ఈసారి ఏకంగా రూ.2 లక్షల పైనే!

Last Updated : Feb 27, 2025, 7:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.