యాదాద్రి భువనగిరి జిల్లా.. యాదాద్రిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది.
ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రిలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపి, మొక్కులు చెల్లించుకున్నారు.
ఘనంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం
అంతకుముందు స్వామివారు గజవాహనంపై ఆలయ వీధుల్లో ఊరేగుతూ కల్యాణ మండపానికి చేరుకున్నారు. ప్రభుత్వం తరఫున కలెక్టర్ అనితా రామచంద్రన్.. పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కల్యాణోత్సవంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డిలతో పాటు పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:కొలువుల భర్తీపై మాటల యుద్ధం.. వేడెక్కిన పట్టభద్రుల పోరు