తెలంగాణ

telangana

By

Published : Oct 25, 2019, 11:49 AM IST

ETV Bharat / state

బస్​పాస్​లు అనుమతించడం లేదంటూ రోడ్డుపై నిరసన

ఆర్టీసీ బస్సుల్లో బస్​పాస్​లు అనుమతించడం లేదంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కొండగడప బస్టాప్​వద్ద చేటుచేసుకుంది.

బస్​పాస్​లు అనుమతించడం లేదంటూ రోడ్డుపై నిరసన

ఆర్టీసీ బస్సుల్లో బస్​పాస్​లు అనుమతించాలని ముఖ్యమంత్రి ఆదేశించినా తాత్కాలిక కండక్టర్లు పట్టించుకోవడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప బస్టాప్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సుమారు 35 మంది విద్యార్థులు పాటిమట్ల ఉన్నత పాఠశాలకు ప్రతిరోజు ఆర్టీసీ బస్సులో వెళ్లేవారు. తాత్కాలిక ఆర్టీసీ ఉద్యోగులు కొండగడప స్టేజి వద్ద బస్సులు ఆపడం లేదని, ఒకవేళ ఆపినా విద్యార్థుల బస్సు పాసులను అనుమతిండం లేదని వాపోయారు. ప్రభుత్వ వెంటనే స్పందించి బస్సుల్లో బస్​పాస్​లు అనుమతించాలని కోరుతున్నారు.

బస్​పాస్​లు అనుమతించడం లేదంటూ రోడ్డుపై నిరసన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details