ఆర్టీసీ బస్సుల్లో బస్పాస్లు అనుమతించాలని ముఖ్యమంత్రి ఆదేశించినా తాత్కాలిక కండక్టర్లు పట్టించుకోవడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప బస్టాప్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. సుమారు 35 మంది విద్యార్థులు పాటిమట్ల ఉన్నత పాఠశాలకు ప్రతిరోజు ఆర్టీసీ బస్సులో వెళ్లేవారు. తాత్కాలిక ఆర్టీసీ ఉద్యోగులు కొండగడప స్టేజి వద్ద బస్సులు ఆపడం లేదని, ఒకవేళ ఆపినా విద్యార్థుల బస్సు పాసులను అనుమతిండం లేదని వాపోయారు. ప్రభుత్వ వెంటనే స్పందించి బస్సుల్లో బస్పాస్లు అనుమతించాలని కోరుతున్నారు.
బస్పాస్లు అనుమతించడం లేదంటూ రోడ్డుపై నిరసన
ఆర్టీసీ బస్సుల్లో బస్పాస్లు అనుమతించడం లేదంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా కొండగడప బస్టాప్వద్ద చేటుచేసుకుంది.
బస్పాస్లు అనుమతించడం లేదంటూ రోడ్డుపై నిరసన