యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో ప్రపంచ ఖ్యాతిగాంచిన జైన దేవాలయంలో ఏటా మహావీర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. కాగా ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ఉత్సవాలను ఎటువంటి ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా ముగించారు.
భక్తులు లేకుండానే కొలనుపాకలో మహావీర్ రథోత్సవం - కొలనుపాక జైన్దేవాలయం
లాక్డౌన్ కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లా కొలనుపాక జైన్ దేవాలయంలో మహావీర్ జయంతి ఉత్సవాలను భక్తులు లేకుండానే నిర్వహించారు. రథోత్సవాన్ని పూజారులే ఊరేగించారు.

భక్తులు లేకుండానే కొలనుపాకలో మహావీర రథోత్సవం
ఈ ఉత్సవానికి దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి జైనులు మార్వాడీలు పెద్ద ఎత్తున హాజరవ్వాల్సి ఉండగా.. లాక్డౌన్ కారణంగా భక్తులు లేకుండానే ఆలయ పూజారులు మాత్రమే ఉండి రథోత్సవాన్ని నిర్వహించారు.