తెలంగాణ

telangana

By

Published : May 27, 2020, 4:20 PM IST

ETV Bharat / state

'ప్రజా సమస్యలపై పోరాడేది భాజపా మాత్రమే'

వరంగల్ గ్రామీణ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో అర్చకులు, పాస్టర్లు, ఇమామ్, జర్నలిస్టులకు మోదీ కిట్టు రూపంలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఎన్ని సమస్యలు ఎదురైనా అన్ని వర్గాల ప్రజల పట్ల పోరాడేది భాజపా మాత్రమే అని స్పష్టం చేశారు.

The commodities were delivered under the auspices of former MLA Kondetti Sridhar.
ప్రజా సమస్యలపై పోరాడేది భాజపా మాత్రమే

లాక్​డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు.. వరంగల్ గ్రామీణ జిల్లా భాజపా నేతలు అండగా నిలుస్తున్నారు. పర్వతగిరి మండల కేంద్రంలోని అర్చకులు, పాస్టర్లు, ఇమామ్​లు, జర్నలిస్టులకు మోదీ కిట్టు రూపంలో మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ ఆధ్వర్యంలో నిత్యావర సరకులను అందజేశారు.

తెరాస నేతలను నమ్మి అధికారం అప్పగిస్తే.. ప్రజలను వంచనకు గురిచేశారని భాజపా నేతలు ఆరోపించారు. ఎన్ని సమస్యలు ఎదురైనా అన్ని వర్గాల ప్రజల పట్ల పోరాడేది భాజపా మాత్రమే అని స్పష్టం చేశారు. లాక్​డౌన్ అనుమతులు సడలిస్తుండటం వల్ల.. కరోనా వ్యాప్తి అధికమయ్యే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:ఆధునిక సేద్యం.. అధిక లాభం: మంత్రి ఇంద్రకరణ్

ABOUT THE AUTHOR

...view details