తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఓటు ఛాలెంజ్ విసరండి.. ఓటింగ్ శాతాన్ని పెంచండి' - vote challenge by vikarabad collector to district sp

పురపాలిక ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆయేషా మస్రత్... ఎస్పీ నారాయణతో పాటు పలువురు అధికారులకు ఓటు ఛాలెంజ్​ను విసిరారు.

vote challenge by vikarabad collector to district sp
వికారాబాద్​లో ఓటు ఛాలెంజ్​ విసిరిన కలెక్టర్ ఆయేషా మస్రత్

By

Published : Jan 20, 2020, 10:15 AM IST

వికారాబాద్ జిల్లా తాండూరులో ఆదివారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఆయేషా మస్రత్ ఓటు ఛాలెంజ్​ విసిరారు. పురపాలిక ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఈ ఛాలెంజ్​ తీసుకొచ్చినట్లు ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ జిల్లా ఎస్పీ నారాయణకు ఛాలెంజ్​ను విసిరారు.

ఎస్పీ నారాయణ ఓటు ఛాలెంజ్​ను స్వీకరిస్తూ.. జిల్లాలోని పోలీస్​ శాఖ అధికారులకు ఛాలెంజ్​ను విసిరారు. తాండూరు ఆర్డీవో వేణుమాధవ్, డీఎస్పీ లక్ష్మీనారాయణ, పురపాలక కమషనర్ మహ్మద్ సాబీర్ అలీ, తహసీల్దార్ చిన్నప్ప నాయుడు తదితరులు ఓటు ఛాలెంజ్​ను స్వీకరించారు.

వికారాబాద్​లో ఓటు ఛాలెంజ్​ విసిరిన కలెక్టర్ ఆయేషా మస్రత్

ఇదీ చదవండి:నిర్భయ దోషి పిటిషన్​పై నేడు 'సుప్రీం' విచారణ

ABOUT THE AUTHOR

...view details