తెలంగాణ

telangana

ETV Bharat / state

'పూట గడవట్లేదు.. పింఛను మంజూరు చేయండి' - తెలంగాణ వార్తలు

ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా తనకు పింఛను మంజూరు చేయడం లేదని 43 ఏళ్ల శంకరయ్య వికారాబాద్ కలెక్టర్​ను ఆశ్రయించాడు. ఎటూ వెళ్లి పనులు చేసుకోలేని పరిస్థితిలో ఉన్న తనకు పింఛన్ ఇప్పించి ఆదుకోవాలని విన్నవించాడు.

Shankarayya had approached the Vikarabad Collector alleging that the pension was not being sanctioned
'పూట గడవట్లేదు.. పింఛను మంజూరు చేయండి'

By

Published : Jan 4, 2021, 4:58 PM IST

అన్ని రకాలుగా అర్హుడైన తనకు పింఛను మంజూరు చేయడం లేదని వికారాబాద్​కు చెందిన సన్యాల శంకరయ్య కలెక్టర్ పౌసుమీ బసును కోరాడు. తన దయనీయ పరిస్థితిని వివరించారు. గతంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదని వాపోయాడు. తన భార్య వ్యవసాయ కూలి పనులు చేసి తనను పోషిస్తోందని శంకరయ్య పేర్కొన్నాడు.

2018లో సదరం క్యాంప్​లో పరీక్షించిన వైద్యులు 52 శాతం అంగవైకల్యం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం అందజేశారు. 43 ఏళ్ల శంకరయ్య ఎటూ వెళ్లి పనులు చేసుకోలేని పరిస్థితి. పూట గడవడం కష్టంగా ఉందని, పింఛన్ ఇప్పించి ఆదుకోవాలని శంకరయ్య కోరుతున్నాడు.

ఇదీ చూడండి: ఆ విద్యార్థులకు మంత్రులు కేటీఆర్‌, సబిత ప్రశంసలు

ABOUT THE AUTHOR

...view details