ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ ఫొటోగ్రాఫర్లు ఎంతో అభివృద్ధి చెందాలని ఎడిట్ పాయింట్ ఇండియా డైరెక్టర్ రమేశ్ అన్నారు. ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు.
మారుతున్న టెక్నాలజీ వారికి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా వస్తున్న కెమెరాలు.. వాటిని ఉపయోగించే విధానం తదితర అంశాలపై గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద ఫొటోగ్రాఫర్లకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.