తెలంగాణ

telangana

By

Published : Oct 4, 2019, 6:07 PM IST

ETV Bharat / state

కాంగ్రెస్​కే మద్దతిచ్చి ప్రచారం చేస్తాం : కోదండరాం

హుజూర్​నగర్​ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన ప్రచారం చేస్తానని తెరాస కోదండరాం తెలిపారు. అసమర్థ తెరాస పాలనను సాగనంపాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

అసమర్థ తెరాస పాలనను సాగనంపాలి : కోదండ రాం

హుజూర్​నగర్​ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్​కు మద్దతు ప్రకటించి ప్రచారంలో పాల్గొంటానని తెజస అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవి అమలు కావట్లేదని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర అందించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, నల్లగొండ, భువనగిరిలో స్థానాల్లో తెరాస ఓడిపోవడం ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తోందని ఎద్దేవా చేశారు. హుజూర్​నగర్ ఉప ఎన్నికలో తెరాసను ఓడించాలని ఓటర్లను కోరారు. ప్రభుత్వ వైఫల్యాలే తెరాసను ఓటమి పాలు చేస్తాయన్నారు. నిరంకుశ పాలనను పారద్రోలి ప్రజల బతుకు పోరాటం కోసం కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని సూచించారు.

అసమర్థ తెరాస పాలనను సాగనంపాలి : కోదండ రాం

ABOUT THE AUTHOR

...view details