తెలంగాణ

telangana

By

Published : Oct 1, 2019, 9:28 AM IST

ETV Bharat / state

హుజూర్ నగర్​లో వికలాంగుల సంఘం నామినేషన్లు

రాష్ట్రంలో అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికల పొటీ రసవత్తరంగా మారుతోంది. ఇటీవల ప్రభుత్వ పనితీరును నిరసిస్తూ 85 ఏళ్ల బామ్మ నామినేషన్ వేయగా.. తాజాగా వికలాంగుల సంఘం నుంచి ఐదుగురు సభ్యులు నామినేషన్ వేశారు.

హుజూర్ నగర్​లో వికలాంగుల సంఘం నామినేషన్లు

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో వికలాంగ సంఘం తరఫున ఐదుగురు సభ్యులు నామినేషన్ వేసినట్టు సంఘం ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 119 శాసనసభలో ఏ ఒక్క ఎమ్మెల్యే వికలాంగులను పట్టించుకోకపోవడం లేదని అన్నారు. అన్ని రంగాల్లో తమను అణచి వేస్తున్నారని, తమకు రావలసిన ఉద్యోగాల కోటాలో అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గం వ్యాప్తంగా పదివేల మంది వికలాంగులు తమకే ఓట్లు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కోదాడ నియోజకవర్గ తీర్పులో వికలాంగులు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు.

హుజూర్ నగర్​లో వికలాంగుల సంఘం నామినేషన్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details