సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎస్పీ క్యాంపస్ స్కూల్లో తెదేపా అభ్యర్థి చావా కిరణ్మయి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వృద్ధులకు, వికలాంగులకు ఇబ్బంది కలగకుండా వీల్ఛైర్లు అందుబాటులో ఉంచారు. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మఠంపల్లి మండలం కేంద్రంలోని 79వ పోలింగ్ బూత్లో రెండు ఈవీఎంలు పదినిమిషాల పాటు మొరాయించాయి. పాలకీడు మండలం బెట్టి తండాలో పదినిమిషాల పాటు ఈవీఎంలు పనిచేయలేదు. కొన్ని పోలింగ్ బూతుల్లో వెలుతురు లేక ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు.
ఓటు హక్కును వినియోగించుకున్న చావా కిరణ్మయి
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి చావా కిరణ్మయి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఓటు హక్కును వినియోగించుకున్న చావా కిరణ్మయి
TAGGED:
హుజూర్ నగర్ ఉప ఎన్నికలు