తెలంగాణ

telangana

By

Published : Oct 21, 2019, 10:17 AM IST

ETV Bharat / state

ఓటు హక్కును వినియోగించుకున్న చావా కిరణ్మయి

సూర్యాపేట జిల్లా హుజూర్​ నగర్ ఉప ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి చావా కిరణ్మయి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఓటు హక్కును వినియోగించుకున్న చావా కిరణ్మయి

ఓటు హక్కును వినియోగించుకున్న చావా కిరణ్మయి

సూర్యాపేట జిల్లా హుజూర్​ నగర్ ఎస్​పీ క్యాంపస్ స్కూల్​లో తెదేపా అభ్యర్థి చావా కిరణ్మయి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. వృద్ధులకు, వికలాంగులకు ఇబ్బంది కలగకుండా వీల్​ఛైర్లు అందుబాటులో ఉంచారు. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. మఠంపల్లి మండలం కేంద్రంలోని 79వ పోలింగ్ బూత్​లో రెండు ఈవీఎంలు పదినిమిషాల పాటు మొరాయించాయి. పాలకీడు మండలం బెట్టి తండాలో పదినిమిషాల పాటు ఈవీఎంలు పనిచేయలేదు. కొన్ని పోలింగ్ బూతుల్లో వెలుతురు లేక ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details