సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పు గూడెం గ్రామంలో వెయ్యి కర్జూర మొక్కలు నాటారు. స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం చెరువు కట్టకి ఇరువైపులా సర్పంచ్ గుండగాని శ్రీనివాస్ గౌడ్ ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటారు.
కర్జూర పండ్లు మనిషికి బలవర్ధక ఆహారం
మన తాతలు నాటిన తాటి చెట్లను మనం సాగు చేస్తున్నామనీ, అలాగే మనం నాటిన మొక్కలు భవిష్యత్ తరాలకి ఉపయోగపడతాయని సర్పంచ్ అన్నారు. కర్జూర పండ్లు మనిషికి బలవర్ధక ఆహారమనీ, వీటిని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ఈ మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.