తెలంగాణ

telangana

By

Published : Oct 14, 2019, 10:16 AM IST

ETV Bharat / state

ఎన్నికల ప్రచారంలో.. ఎంపీ బండి సంజయ్

హుజూర్​నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. అన్ని ప్రధాన పార్టీలకు ఈ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ భాజపా అభ్యర్థి రామారావు తరుపున ప్రచారం చేశారు.

ఎన్నికల ప్రచారంలో.. ఎంపీ బండి సంజయ్

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ ఉప ఎన్నికలో భాగంగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ భాజపా అభ్యర్థి కోట రామారావు తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నిరుపయోగంగా ఉన్న నాలుగు వేల ఇందిరమ్మ ఇళ్లను ఎంపీ సంజయ్ పరిశీలించారు. ఇళ్ల విషయంలో కాంగ్రెస్ కమీషన్లు తీసుకుందని, తెరాస కూడా ఇదే బాటలో నడుస్తుందని ఆరోపించారు.

తెరాస ప్రభుత్వం వచ్చే ఆరు సంవత్సరాలు అయినా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేదని సంజయ్​ ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ రాష్ట్రంలో రెండు లక్షల ఇళ్ల నిర్మాణం కోసం పీఎం ఆవాస్ యోజన పథకం కింద నిధులు మంజూరు చేస్తే... రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. నిధులను దుర్వినియోగం చేశారని ఎంపీ మండిపడ్డారు.

ఎన్నికల ప్రచారంలో.. ఎంపీ బండి సంజయ్

ఇదీ చూడండి : సమ్మె 10వ రోజు: ఆందోళనలు, అరెస్టులు, ఇద్దరి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details