తెలంగాణ

telangana

ETV Bharat / state

'నియోజకవర్గాన్ని కుటుంబంగా భావించి అభివృద్ధి' - ramreddy damodar reddy participated in huzurnagar campaign

నియోజకవర్గాన్ని కుటుంబంగా భావించి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి అభివృద్ధి చేశారని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్​ రెడ్డి అన్నారు. హుజూర్​ నగర్​ ఉపఎన్నికల్లో భాగంగా... కాంగ్రెస్​ అభ్యర్థి తరఫున ప్రచారం నిర్వహించారు.

'నియోజకవర్గాన్ని కుటుంబంగా భావించి అభివృద్ధి'

By

Published : Oct 10, 2019, 7:39 PM IST

సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలో కాంగ్రెస్​ అభ్యర్థి పద్మావతి రెడ్డి తరఫున మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్​ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గాన్ని తన కుటుంబంగా భావించి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారని వ్యాఖ్యానించారు. 30 వేల మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. ​ 3,500 కోట్లతో అభివృద్ధి చేసి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారని పద్మావతి రెడ్డి అన్నారు. రాహుల్​ గాంధీ ఆదేశాలతో ఉత్తమ్​ ఎంపీగా పోటీ చేసి గెలవడం వల్ల ఉపఎన్నిక వచ్చిందని ఆమె అన్నారు.

'నియోజకవర్గాన్ని కుటుంబంగా భావించి అభివృద్ధి'

ABOUT THE AUTHOR

...view details