తెలంగాణ

telangana

By

Published : Jul 8, 2019, 6:32 PM IST

ETV Bharat / state

'హరితహారంలో మెుక్కలు నాటిన జడ్పీటీసీ కవిత'

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో జడ్పీటీసీ సభ్యురాలు కనగల కవిత హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కలు నాటి.. ప్రతీ వ్యక్తి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.

వానలు సమృద్ధిగా కురవాలనే ప్రభుత్వం హరితహారం చేపట్టింది : జడ్పీటీసీ కవిత

ప్రతీ ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి వాటి పర్యావరణ సంరక్షణకు దోహదపడాలని జడ్పీటీసీ సభ్యురాలు కవిత అన్నారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గుండారంలో జడ్పీటీసీ సభ్యురాలు కనగల కవిత హరితహారంలో భాగంగా మొక్కలను నాటారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అడవులు అంతరించిపోతున్న సమయంలో వానలు సమృద్ధిగా కురవాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. పచ్చ ధనంతోనే జలవనరులను కాపాడుకోగలుగుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, సర్పంచి లావణ్య, స్థానికులు పాల్గొన్నారు.

ప్రతీ వ్యక్తీ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి : జడ్పీటీసీ కవిత

ABOUT THE AUTHOR

...view details