తెలంగాణ

telangana

By

Published : May 26, 2020, 11:14 AM IST

ETV Bharat / state

మొక్కజొన్న వేయబోమని రైతుల ప్రతిజ్ఞ

నియంత్రిత వ్యవసాయ విధానంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ పరిధిలోని వివిధ మండలాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. బాచెపల్లి గ్రామ రైతులందరూ కలిసి మొక్కజొన్న వేయమని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

awareness program on agriculture in sangareddy district
మొక్కజొన్న వేయబోమంటూ రైతుల ప్రతిజ్ఞ

సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని బాచెపల్లి గ్రామ రైతులందరూ కలిసి మక్కలు వేయబోమని ఏకగ్రీవంగా తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వం సూచనలను పాటించి పంట సాగు చేస్తామన్నారు. కంగ్టి, నారాయణ ఖేడ్, మనురు మండలంలోని వివిధ గ్రామాల్లో కూడా గ్రామస్థులoదరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ, రెవెన్యూ, పీఏసీఎస్ అధికారులు రైతులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details