తెలంగాణ

telangana

By

Published : Apr 17, 2021, 2:29 AM IST

ETV Bharat / state

సమాచారం ఇవ్వకుండానే ఎలా కలుస్తారు: సంజయ్​

రంగారెడ్డి జిల్లా లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నిక విషయంలో భాజపా నగర పాలక నేతలు వ్యవహరించిన తీరుపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా మంత్రి కేటీఆర్​ను ఎలా కలుస్తారని రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని ప్రశ్నించారు.

bandi Sanjay, lingojiguda issue
సమాచారం ఇవ్వకుండానే ఎలా కలుస్తారు: సంజయ్​

లింగోజిగూడ డివిజన్ ఉపఎన్నిక ఏకగ్రీవం విషయంలో తెరాస నేతలను భాజపా నేతలు కలవడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పూర్తి సమాచారం ఇవ్వకుండానే కేటీఆర్​ను కలిశారని మండిపడ్డారు.

సిట్టింగ్ స్థానంలో భాజపా ఘన విజయం సాధిస్తుందని.. అలాంటి సమయంలో తెరాస నేతలను కలిసి ఏకగ్రీవం గురించి అడగడమేంటని పార్టీ నేతలతో బండి సంజయ్ అన్నారు. ఇందుకు కారణమైన జిల్లా నాయకులపై కఠిన చర్యలు తీసుకుంటానని బండి సంజయ్ తెలిపారు.

ఇదీ చూడండి :లింగోజిగూడ ఉపఎన్నికకు దూరంగా ఉండాలని తెరాస నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details