పెద్దపల్లి జిల్లా రామగిరి మండల కేంద్రం సెంటినరీ కాలనీలోని రాణి రుద్రమదేవి క్రీడామైదానంలో రాష్ట్ర జూనియర్ నెట్ బాల్ ఛాంపియన్ షిప్ అండర్19 బాలబాలికల పోటీలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రం ఏర్పడ్డాక రెండోసారి ఈ పోటీలను జిల్లాలో నిర్వహిస్తున్నారు. 3 రోజులు పాటు జరగనున్న ఈ పోటీల్లో మొదటి రోజు పరిచయ కార్యక్రమాలు నిర్వహించారు. పోటీలలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, మెదక్ ,మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాలకు సంబంధించిన క్రీడాకారులు పాల్గొన్నారు. 120 మంది బాలురు, 120 మంది బాలికలు పాల్గొననున్నారు.
రాష్ట్ర జూనియర్ నెట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రారంభం
రాష్ట్ర జూనియర్ నెట్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలను పెద్దపల్లి జిల్లా రామగిరిలో ప్రారంభించారు. మూడు రోజులు జరగనున్న ఈ పోటీల్లో వివిధ జిల్లాలకు చెందిన సుమారు 120 మంది బాలురు, 120 మంది బాలికలు పాల్గొంటున్నారు.
STATE JUNIOR NET BALL CHAMPIONSHIP GAMES STARTED AT PEDDAPALLY