తెలంగాణ

telangana

By

Published : Sep 4, 2019, 8:04 PM IST

ETV Bharat / state

'పసుపు బోర్డు ఏర్పాటు చేయండి'

నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని పసుపు, ఎర్రజొన్న రైతులు డిమాండ్ చేశారు.

'పసుపు బోర్డు ఏర్పాటు చేయండి'

నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పడే వరకు నిరంతరం ఆందోళనలు చేస్తామని పసుపు, ఎర్రజొన్న రైతులు హెచ్చరించారు. కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. ఎంపీ ధర్మపురి అరవింద్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. భాజపా ప్రభుత్వం ఏర్పడిన ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పిన స్థానిక ఎంపీ అరవింద్ వెంటనే తను అన్న మాట నిలబెట్టుకొని పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఐక్య కార్యాచరణ రైతు సంఘం కోరింది.

'పసుపు బోర్డు ఏర్పాటు చేయండి'

ABOUT THE AUTHOR

...view details