తెలంగాణ

telangana

By

Published : Jan 1, 2020, 9:47 PM IST

ETV Bharat / state

మిట్ట మధ్యాహ్నం చోరీ.. 37 తులాల బంగారం మాయం

నిజామాబాద్​ జిల్లా వన్నెల్​(బి) గ్రామంలో ఇవాళ మధ్యాహ్నం చోరీ జరిగింది. రెండు ఇళ్ల నుంచి 37 తులాల బంగారం, రూ.57 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు.

choty at nizamabad district vannel village
మిట్ట మధ్యాహ్నం చోరీ.. 37 తులాల బంగారం మాయం

నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్‌(బి) గ్రామంలో ఇవాళ మధ్యాహ్నం భారీ చోరీ జరిగింది. తాళం వేసిన రెండు ఇళ్ల నుంచి సుమారు 37 తులాల బంగారం, రూ. 57 వేల నగదు కాజేశారు దుండగులు.

వన్నెల్​(బీ) గ్రామంలో సంతోష్​, గడ్డం నర్సయ్య అనే రైతులు పొలానికి వెళ్లారు. పసుపు తవ్వేందుకు ఇంటికి తాళం వేసి కుటుంబమంతా వెళ్లిపోయారు. ఇదే అదునుగా భావించిన దొంగలు సంతోష్‌ ఇంట్లో బీరువా తాళం పగులగొట్టి.. 37 తులాల బంగారు నగలు, రూ.17 వేలు నగదు ఎత్తుకెళ్లారు. ఆ ఇంటి పక్కనే ఉన్న గడ్డం నర్సయ్య ఇంట్లోకి సైతం చోరబడి రూ.40 వేలు నగదు కాజేశారు. మిట్ట మధ్యాహ్నం చోరీ జరగడం స్థానికులను ఆందోళకు గురిచేసింది.
బాధితుల ఫిర్యాదుతో ఘటన స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. క్లూస్​టీంతో వేలిముద్రలు సేకరించారు.

మిట్ట మధ్యాహ్నం చోరీ.. 37 తులాల బంగారం మాయం

ఇవీచూడండి: ప్రాణం పోసే అంబులెన్సే.. ప్రాణం తీసింది!

ABOUT THE AUTHOR

...view details