ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్కు విరుద్ధంగా తెరాస నాయకులు వ్యవహరిస్తున్నారంటూ భాజపా నాయకులు బుధవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి నారాయణ రెడ్డికి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా.. సీఎంఆర్ చెక్కుల పంపిణీ చేశారని ఆరోపించారు. అంతేకాకుండా జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేల సమక్షంలో భాజపా కార్పొరేటర్, ఎంపీటీసీలకు తెరాస కండువా కప్పడం ఎన్నికల కోడ్కు విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎన్నికల కోడ్కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు: భాజపా నాయకులు - తెరాస నాయకులు ఎన్నికల కోడ్ అతిక్రమిస్తున్నారని ఫిర్యాదు నిజామాబాద్
తెరాస నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని భాజపా నాయకులు నిజామాబాద్ కలెక్టర్, ఈసీకి ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా.. సీఎంఆర్ చెక్కుల పంపిణీ చేశారని ఆరోపించారు. తెరాస పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కవిత అభ్యర్థిత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నికల కోడ్కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు: భాజపా నాయకులు
ఈ నేపథ్యంలో తెరాస పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కవిత అభ్యర్థిత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ న్యాలం రాజు, భాజపా నగర అధ్యక్షుడు పంచరెడ్డి లింగం, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఎన్నికల కోడ్ పాటించని తెరాస నేతలపై చర్యలు తీసుకోవాలి : కాంగ్రెస్