తెలంగాణ

telangana

By

Published : Mar 19, 2021, 5:17 AM IST

ETV Bharat / state

మా వాళ్ల ఆచూకీ ఎక్కడ.. భైంసా బాధితుల ప్రశ్న

భైంసా అల్లర్లలోని బాధితుల ఆచూకీ కోసం వారి కుటుంబాలు వాపోతున్నారు. ఆత్మరక్షణకు ప్రయత్నించడం నేరమవుతుందా అని ఓ బాధితుడి తల్లి ప్రశ్నించింది. పోలీసులు స్పందించి... తమ వారు ఎక్కడున్నారో తెలపకపోతే బలవన్మరణానికి పాల్పడతామని హెచ్చరించింది.

Question of the victims of violence Where are our people
మా వాళ్ల ఆచూకీ ఎక్కడ.. భైంసా బాధితుల ప్రశ్న

నిర్మల్ జిల్లా భైంసా అల్లర్లలోని బాధితుల ఆచూకీ కోసం వారి కుటుంబాలు విలపిస్తున్నాయి. సీసీటీవీ ఫుటేజీలో తమ పిల్లలు కనిపించారని చెప్పి తీసుకెళ్లిన పోలీసులు... అక్కడ దాడికి పాల్పడిన వారిని ఎందుకు వదిలేశారని నిలదీశాయి.

అత్యవసర పరిస్థితుల్లో ఆత్మరక్షణకు ప్రయత్నించడం నేరమవుతుందా అని గోకుల్ తల్లి సురేఖ ప్రశ్నించింది. పోలీసులు వెంటనే స్పందించి... తమ వారు ఎక్కడున్నారో తెలపకపోతే బలవన్మరణానికి పాల్పడతామని హెచ్చరించింది.

ఇదీ చదవండి:రాష్ట్రంలో ఆరు కొత్త ఎయిర్​ పోర్టులు అభివృద్ధి

ABOUT THE AUTHOR

...view details