తెలంగాణ

telangana

By

Published : Apr 22, 2021, 8:35 PM IST

ETV Bharat / state

ప్రాణం పణంగాపెట్టి కొవిడ్​ గర్భిణిలకు చికిత్స

కొవిడ్​ రిపోర్టులో పాజిటివ్​ అనిరాగానే అప్పటి వరకు మనతో ఉన్నవాళ్లు ఒక్కసారిగా మారిపోతున్నారు. కనీసం మనిషిగా అయినా చూసే పరిస్థితి ఉండడం లేదు. అయినవాళ్లే దూరం పెట్టేస్తున్నప్పుడు బయటి వాళ్లు ఎలా ఆదుకుంటారు. కానీ కొవిడ్​ మహమ్మారి సోకిందని తెలిసినా... ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా తమ ప్రాణానికి ముప్పే అని తెలిసినా.. ఓ బిడ్డ ప్రాణం పోయడానికి.. ఓ అమ్మ ప్రాణం నిలబెట్టేందుకు సైనికులై నిలిచారు భైంసా ప్రాథమిక ఆస్పత్రిలోని ఆరోగ్య సిబ్బంది.

భైంసా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం
నిర్మల్​ వార్తలు

నిర్మల్​ జిల్లాలోని భైంసా ప్రాథమిక ఆస్పత్రి వైద్య సిబ్బంది ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. కొవిడ్​ బారిన పడిన గర్భిణులకు అండగా నిలుస్తూ.. వైద్య సేవలు అందిస్తూ ప్రసవాలు చేస్తున్నారు. కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కొవిడ్​ సోకిన గర్భిణులకు వైద్యం అందించడం లేదు. ఈ సమయంలో కొవిడ్​ సోకిన గర్భిణులకు నిర్మల్​లోని భైంసా ప్రాథమిక ఆస్పత్రి దేవాలయంలా మారింది. తమ బిడ్డలకు జన్మనిచ్చే గర్భగుడిలా కనిపిస్తోంది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ప్రసూతి విభాగం ఆరోగ్య సిబ్బంది సువర్ణ, త్రివేణి, శైలజ, సునీత, మంజూష... కొవిడ్​ రోగులకు చికిత్స చేస్తూనే... వైద్యుల సలహాలపై గర్భిణులకు శారీరక వ్యాయామాలు చేయిస్తూ సాధారణ ప్రసవం జరిగేలా చూస్తున్నారు. వారి కృషి ఫలితంగానే ఇప్పటి వరకు ఏడుగురు కొవిడ్​ బాధిత గర్భిణులు పండండి బిడ్డలకు జన్మనిచ్చారు. వైద్య వృత్తిలో ఉంటూ తమవంతుగా గర్భిణులకు సాయం చేస్తున్నామని వైద్యులు, సిబ్బంది తెలిపారు.

అయినవాళ్లే రానివ్వని వేళ… మేమున్నామంటూ సాయం చేస్తున్న వైద్య సిబ్బంది సేవలు వర్ణణాతీతం. ఓ ప్రాణానికి జన్మనిచ్చేందుకు.. ఓ ప్రాణాన్ని కాపాడేందుకు... తమ ప్రాణాన్ని పణంగా పెడుతున్న వారి మానవత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తప్ప ఏమిచెప్పగలం.

ఇదీ చూడండి:ప్రాణాలు పోయే ముందు గాంధీకి వస్తున్నారు: ఈటల

ABOUT THE AUTHOR

...view details