తెలంగాణ

telangana

By

Published : Jan 30, 2021, 5:28 PM IST

ETV Bharat / state

'పురపాలికలో అవినీతిపై విజిలెన్స్​ విచారణ చేపట్టాలి'

నిర్మల్ పురపాలికలోని ప్రతి విభాగంలోనూ అవినీతి జరుగుతోందని కాంగ్రెస్, భాజపా కౌన్సిలర్​లు ఆరోపించారు. వెంటనే విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ... మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.

Concern of Congress and BJP councilors in front of Nirmal Municipal Office
నిర్మల్​ మున్సిపల్​ కార్యాలయం ఎదుట కాంగ్రెస్​, భాజపా కౌన్సిలర్ల ఆందోళన

నిర్మల్ మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై విజిలెన్స్ అధికారులతో విచారణ చేపట్టాలని... కాంగ్రెస్, భాజపా కౌన్సిలర్​లు డిమాండ్​ చేశారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. తెరాస నాయకులు అధికారాన్ని అడ్డు పెట్టుకుని విపక్ష నేతలను పట్టించుకోవడం లేదని... కౌన్సిలర్ ఉమారాణి అన్నారు. ప్రతి నెలా నిర్వహించే సర్వసభ్య సమావేశంలో ఎలాంటి సమస్యలు చర్చించకుండానే మున్సిపల్​ ఛైర్మన్​ సమావేశాన్ని ముగిస్తున్నారని అన్నారు.

మున్సిపల్ కార్యాలయంలోని ప్రతి విభాగంలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్​కు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. అక్రమాలపై ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పకుండా దాటవేస్తున్నారని... సమాచారం అడిగినా స్పందించడం లేదని తెలిపారు. మున్సిపల్ కమిషనర్​ను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: పసుపు బోర్డుపై ఎంపీ అర్వింద్ హామీ ఏమైంది..?: జీవన్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details