జిల్లాలో పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం నుంచి అన్ని మండలాల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రకృతి వనాల ఏర్పాటుకు జిల్లాలోని ప్రభుత్వ భూములను గుర్తించి.. రికార్డుల్లో నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. మండలాల్లో సమస్యలు ఉన్న భూములకు సంబంధించి గ్రామస్థులతో సమావేశం నిర్వహించి.. సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.