తెలంగాణ

telangana

By

Published : Nov 1, 2019, 11:28 PM IST

ETV Bharat / state

'గాంధీజీ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి'

నారాయణపేట జిల్లా కేంద్రంలో గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకుని గాంధీ సంకల్ప యాత్ర ప్రారంభించారు.

నారాయణపేటలో గాంధీ సంకల్ప యాత్ర

నారాయణపేటలో గాంధీ సంకల్ప యాత్ర

గాంధీజీ కలలుగన్న ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకుని భాజపా నేతలు డీకే అరుణ, జితేందర్​రెడ్డి గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ యాత్రను ప్రారంభించినట్లు అరుణ తెలిపారు. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి గడపగడపకు వెళ్లి మహిళలను చైతన్య పరుస్తున్నామని తెలిపారు. గాంధీ విగ్రహానికి పాలతో అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగూరావు నామాజీ, పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details