మత్స్యకారుల అభివృద్ధికి పట్టణాలు, గ్రామాల్లోని చెరువుల్లో చేపల పెంపకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు. వర్షాలు సమృద్ధిగా పడటంతో గ్రామాల్లోని చెరువులు నిండుకుండలా మారాయని చెప్పారు. నల్గొండ జిల్లా ఆలగడప చెరువులో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్యే కలిసి 1,50,000 చేపపిల్లలను వదిలారు.
2020-21 సంవత్సరానికి గానూ మత్స్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వమే అన్ని చెరువులకి చేప పిల్లలను పంపిణీ చేస్తుందని భాస్కరరావు తెలిపారు. మత్స్యకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.