ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని విద్యుత్శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సూచించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆరోవిడత హరితహారం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి: జగదీశ్ రెడ్డి
ఆకుపచ్చ తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం హరితహారం కార్యక్రమం చేపట్టిందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మిర్యాలగూడలో జరిగిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కను నాటారు.
ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలి: మంత్రి జగదీశ్ రెడ్డి
ఈ సందర్భంగా మొక్కను నాటి నీరుపోశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భాస్కరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: పచ్చని పండుగ: హరిత తెలంగాణే లక్ష్యం... ప్రతిమొక్కనూ బతికిద్దాం